కలం, వెబ్ డెస్క్ : వికారాబాద్ (Vikarabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దివ్య (28) అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మరణానికి ముందు దివ్య ఒక సూసైడ్ లెటర్ రాసినట్లు సమాచారం అందుతోంది. వ్యక్తిగత కారణాలా లేక పని ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని వివరాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.
Read Also: ఇరాన్ ప్రతీకార దాడులు.. గల్ఫ్ దేశాల్లో భారీ పేలుళ్లు
Follow Us On: Youtube

