Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్ జిల్లాలో ఎలుగుబంటి మృతి!

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) మండల పరిధిలోని జాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన సదాశివ నగర్ తండా సమీపంలో ఒక ఎలుగుబంటి మృతి చెందింది. స్థానిక రైతులు ఉదయాన్నే తమ పంట పొలాలకు వెళ్లే దారిలో ఈ ఎలుగుబంటి మృతదేహాన్ని గమనించారు. అడవి జంతువు మృతి చెంది ఉండటాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఈ ఎలుగుబంటి అనారోగ్య కారణాల వల్ల మరణించిందా, లేక వయసు పైబడి సహజ మరణం పొందిందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. ఎలుగుబంటి మృతికి గల అసలు కారణాలను అన్వేషించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>