కలం, వెబ్ డెస్క్ : భర్తలను భార్యలు చంపడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఇలాంటి మర్డర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ఓ భార్య అతికిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి (Mandamarri) లో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన మోయిన్, అవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గొడవలు చెలరేగాయి.
ఈ క్రమంలో ఇవాళ (మంగళవారం) మరోసారి గొడవ జరగడంతో తీవ్ర ఆవేశానికి గురయిన అవంతి ఇంట్లో ఉన్న కత్తితో భర్త మోయిన్ పై దాడి చేసింది. రక్తపు మడుగుల్లో ఉన్న మోయిన్ ను గ్రామస్తులు (Mandamarri) గుర్తించి ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.
Read Also: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
Follow Us On: Instagram


