కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ – యూఎస్ (US – Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడింది. పశ్చిమాసియాలో యుద్దం నిలిపివేస్తున్నట్లు అమెరికా వైట్ హౌజ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తో యుద్ధం ముగిసిపోయినట్లుగా పరిగణిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఆ దేశంతో యుద్ధం కొనసాగించడానికి అమెరికా కాంగ్రెస్ నుంచి 60 రోజుల్లోగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ గడువు మే 1 (శుక్రవారం) తో ముగియడంతో శ్వేత సౌధం యుద్ధం ముగింపుపై ప్రకటన చేసింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ సభ్యులపై విమర్శలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు దేశ భక్తులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

