ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (RGUKT)పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటీఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు ఆయా క్యాంపస్‌‌లలో 4400 సీట్ల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

ఈ ఏడాది టెన్త్ పాసైన వారు దీనికి అర్హులు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉండనుంది. https://www.rgukt.in/, ఏపీ ఆన్లైన్ మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల, మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 12న లిస్టును విడుదల చేస్తారు. కౌన్సిలింగ్ అనంతరం జూలై ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>