epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నేపాల్‌లో మళ్లీ ఆందోళన బాట పట్టిన జెన్‌-Z

నేపాల్‌(Nepal)లో మరోసారి జెన్-జీ నిరసన మంటలు చెలరేగాయి. సెప్టెంబర్ నెలలో జెన్-జీ రోడ్డెక్కి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. కాగా తాజాగా అధికారం కోల్పోయిన పార్టీ మద్దతు దారులకు, జెన్-జీ వారికి మరోసారి ఘర్షణలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జెన్-జీ మరోసారి రొడ్డెక్కింది. దీంతో నేపాల్‌లో మరోసారి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నేపాల్‌లోని బారా జిల్లాలో సమావేశాలను నిషేధించారు. అక్కడ Gen Z సభ్యులు, మాజీ ప్రధాన మంత్రి కె‌పి శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ – యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్‌ (సిపిఎన్–యుఎమ్ఎల్) అనుచరులతో ఘర్షణకు దిగారు. ఆర్డర్ పునరుద్ధరణ అవసరాన్ని ప్రస్తావిస్తూ, జిల్లా పరిపాలన కర్ఫ్యూ గురువారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.

బారా జిల్లా సిమరా ప్రాంతంలో యువ నిరసనకారులు, సిపిఎన్–యుఎమ్ఎల్ కార్యకర్తలు వేర్వేరు ర్యాలీలు నిర్వహించగా, ఇద్దరి మధ్య ఘర్షణలు చెలరేగాయి. వాటిలో కొన్ని విమానాశ్రయం సమీపంలో కూడా జరిగాయి. దీనితో అధికారులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. “పరిస్థితి సాధారణంగానే ఉంది… ఎవరూ తీవ్రంగా గాయపడలేదు,” అని నేపాల్(Nepal) పోలీస్ ప్రతినిధి అబి నారాయణ కాఫ్లే తెలిపారు.

Read Also: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: సుప్రీం

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>