కలం, వెబ్డెస్క్ : తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేరళకు కాబోయే సీఎం వీడీ సతీశన్ (VD Satheesan) కూడా అదే దారిలో నడిచాడు. అపద్దర్మ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా విజయన్ వీడీ సతీశ్ కు పినరయి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేరళ నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ ను కాంగ్రెస్ అధిష్ఠానం గురువారం ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల, వీడీ సతీశన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాగా, ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించగా అధిష్టానం వీడీ సతీశన్ ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే సతీశన్ పినరయి విజయన్ ను కలిసి రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమంపై చర్చించారు.

