కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆస్పత్రిలోకి చికిత్స పొందుతున్నారు. వాయు కాలుష్యం కారణంగానే అనారోగ్యానికి గురయ్యారు. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని పలువురు కాంగ్రెస్ నేతలు పూజలు చేస్తున్నారు. టీకాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V Hanumantha Rao) ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని మహంకాళీ దేవాలయంలో మృత్యుంజయ యాగం నిర్వహించారు. సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని, నిత్యం ఆరోగ్యంగా ఉండాలని వీహెచ్ ఆకాంక్షించారు.
సీనియర్ నేత హన్మంతరావుకు ఢిల్లీలో మంచి రాజకీయ సంబంధాలున్నాయి. ముఖ్యంగా సోనియాగాంధీ కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో హనుమంతరావు తెలంగాణలో కీలకంగా వ్యవహరించారు. ఆమె హైదరాబాద్ పర్యటనకొచ్చిన ఎన్నో సార్లు విహెచ్తో ప్రత్యేకంగా ముచ్చటించిన సందర్భాలున్నాయి. ఈ కారణంగానే వీహెచ్ సోనియాపై ప్రత్యేక అభిమానం చూపుతున్నారు.

Read Also: మరోసారి వార్తల్లో ట్రంప్ : ప్రపంచ దేశాధినేతలపై సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)


