epaper
Wednesday, February 18, 2026
epaper

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న USA క్రికెటర్లు

కలం, వెబ్​ డెస్క్​ : యూఎస్​ఏ (యునైటెడ్​ స్టేట్స్​ ఆఫ్​ అమెరికా) క్రికెట్​ జట్టు (USA Cricket Team) సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జట్టు కెప్టెన్​ మోనాంక్ పటేల్​ నేతృత్వంలో సభ్యులు మిలింద్​ కుమార్​, సౌరభ్​ నేత్రావల్కర్ మంగళవారం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతర్జాతీయ క్రికెట్​ సంచలనాలు సృష్టిస్తున్న అమెరికా జట్టు టీ20 వరల్డ్​ కప్​ కోసం భారత్​ లో పర్యటిస్తోంది. మ్యాచ్​ విరామ సమయంలో ఆధ్యాత్మిక సేవలో భాగంగా తిరుమల కొండకు చేరుకున్నారు. ఫిబ్రవరి 15న నమీబియాతో జరిగిన మ్యాచ్​ ఆ జట్టును అమెరికా చిత్తుగా ఓడించింది. గ్రూప్​ ఏ లో ఉన్న యూఎస్​ ఇప్పటికే అన్ని మ్యాచులు ఆడి నాలుగు పాయింట్లు సాధించింది.

Read Also: తొర్రూర్​లో ఉద్రిక్తత.. మాజీ స్పీకర్ హౌస్ అరెస్ట్..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>