కలం, వెబ్ డెస్క్ : పెళ్లంటే పందిళ్లు, భాజా బజంత్రీలు, వేద మంత్రాలు, అగ్ని సాక్షిగా ఏడు అడుగులు.. ఇలాంటి ఘట్టాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకున్నప్పుడు ఇలాంటివి చేస్తారు. కానీ బీహార్లో జరిగిన ఓ వింత వివాహం (Two Women Marriage) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అబ్బాయిలంటే ఇష్టం లేని ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా వంటగదిలోని ‘గ్యాస్ స్టవ్’ సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.
బీహార్లోని సుపాల్ జిల్లాకు చెందిన పూజా గుప్తా (21), కాజల్ కుమారి (18) అనే ఇద్దరు అమ్మాయిలకు ఇన్ స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరినొకరు వదలలేని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో సమాజం ఏమనుకున్నా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతోనే తాము ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో గ్యాస్ స్టవ్ సాక్షిగా దర్మార్ద, కామ, మోక్షంలో తోడుంటానంటూ ప్రమాణం చేస్తూ ఏడడుగులు వేశారు. చనిపోయే వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేశామని తెలిపారు. అయితే, Two Women Marriage ప్రస్తుతం జిల్లాతో పాటు దేశంలో హాట్ టాపిక్ గా మారింది.


