కలం, వెబ్ డెస్క్ : పల్నాడు (Palnadu) జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి ఇద్దరు స్నేహితులు మరణించారు. మృతులు ఎల్లారెడ్డి అలియాస్ పుల్లారెడ్డి (62), అంజిరెడ్డి (61) గా పోలీసులు గుర్తించారు. మృతదేహలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తులు మద్యం అతిగా సేవించి మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారు బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసి మృతి చెందారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బెల్ షాపులో మద్యం కొనుగోలు చేశారని అంటున్నారు. ఈ మరణాలను అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

