కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar) రాజధాని పాట్నాలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయ (TTD Temple) నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీని కోసం బీహార్ ప్రభుత్వం పాట్నా సమీపంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) బీహార్ సీఎం సామ్రాట్ చైదరిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ నాయుడుతో పాటు ప్రముఖ వ్యాపార వేత్త దొరస్వామి కూడా సీఎంను కలిశారు. సామ్రాట్ చౌదరిని శాలువాతో సన్మానించి శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.

