కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని స్పష్టం చేశారు. రేపు ఇరాన్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వెల్లడించారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందరి… రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. శత్రు ప్రాంతాల్లో ఎఫ్ – 15 దూసుకెళ్లిందన్న ట్రంప్.. రెస్క్యూ ఆపరేషన్ లో ఎవరూ గాయపడలేదన్నారు. ఎఫ్ – 15 యుద్ధ విమానం పైలట్ ను రక్షించామని వెల్లడించారు. రెండో పైలట్ కోసం రెస్క్యూ నడుస్తోందన్నారు. అమెరికాకు ఏ దేశానికి లేనన్ని ఆయుధాలున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. రాన్ దారికి రాకపోతే దాని అంతుచూస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

