కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా బాసర (Basara)లో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన భక్తులు సికింద్రాబాద్ లోని కాచిగూడ చెప్పల్ బజార్కు చెందిన సొంత అన్నదమ్ములు చంద్రశేఖర్(38), రామచందర్(36) మల్లేష్ కుమార్ (31)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

