కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్లీ సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు సమ్మె నోటీసులను ఈడీ వెంకన్నకు అందజేశారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2021 వేతన సవరణ చట్టం ప్రకారం 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కోసం ఇస్తున్న రూ.350 కోట్లలో ఎలాంటి కోతలు, షరతులు లేకుండా పూర్తిగా ఇచ్చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే పాత బకాయిలు రూ.2500 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే 14 రోజుల తర్వాత సమ్మె తేదీపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు జేఏసీ నేతలు. ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందజేశామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం లేదన్నారు జేఏసీ నేతలు. ఈ సారి స్పష్టమైన హామీ లేకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.

