epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఏఐ వినియోగంతో జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక

కలం, వెబ్​ డెస్క్​ : ప్రస్తుతం ఆర్టిఫిషీయల్​ ఇంటలిజెన్స్​ (Artificial Intelligence) ట్రెండ్​ నడుస్తోంది. చిలిపి ప్రశ్న నుంచి విలువైన సమాచారం, శస్త్ర చికిత్సల వరకు ప్రతిదాంట్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో దానిని కొందరు మంచి కోసం వాడుతుంటే.. మరికొందరు చెడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సైబర్​ క్రైమ్​ కేసు (Cyber Crimes) ల్లో ఎక్కవ శాతం ఏఐ ఉపయోగించి నేరాలు చేసినవే ఎక్కువగా ఉంటున్నాయి. డీప్​ ఫేక్ (Deep Fake)​, ఫేక్ వాయిస్​ జనరేట్​ చేసి దుండగులు బ్లాక్ మెయిల్​ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో @TelanganaCOPs సోషల్​ మీడియా వేదికగా ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది.

ఏఐ (Artificial Intelligence) ని మంచికోసమే వాడాలని కోరింది. ఏఐతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించింది. వ్యక్తులను కించపరిచేందుకు ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్ వాడొద్దని పేర్కొంది. విజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలని, అవగాహన కల్పించేందుకు మాత్రమే ఏఐని వాడాలని పేర్కొంది. ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ దుర్వినియోగం చేసి చిక్కుల్లో పడొద్దని హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించాలని @TelanganaCOPs ఎక్స్​ వేదికగా సూచించింది.

Read Also: ‘ఉపాధి హామీ’ ఆత్మను చంపేసే కుట్ర

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>