కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసన సభ (Telangana Assembly) నిరవధికంగా వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 10 పని దినాలపాటు జరిగిన ఈ సమావేశాలు 82 గంటల 47 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగాయి. ఈ విడతలో ప్రభుత్వం మొత్తం 11 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, అందులో 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే ఒక బిల్లుపై మరింత లోతైన చర్చ అవసరమని భావించిన సభ, దానిని సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

