epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పల్నాడులో ఘోరం.. కార్మికుడి సజీవ దహనం

పల్నాడు(Palnadu) జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికుడు ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానకంగా విషాదఛాయలు నింపింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హుటాహుటిన మాచర్ల ఆసుప్రతికి తరలించారు. లారీ నుంచి డీజిల్ అన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ అన్‌లోడ్ సమయంలో ఒక్కసారిగా మోటర్ నుంచి చిన్న నిప్పు రవ్వ రేగంది. దీంతో మంటలు చెలరేగాయి.

Palnadu | క్షణాల్లో మంటలు అంతా వ్యాపించాయి. దీంతో ఒక కార్మికుడు సజీవదహనం కాగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన ప్రమాదమా? మానవ తప్పిదమా? లేదంటే ఎవరైనా చేసిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: జామపండును ఇలా తింటేనే అధిక లాభాలు..!

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>