కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన ఆయనకు.. అసెంబ్లీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య ఆయనతో శాసనసభ్యుడిగా ప్రమాణం చేయించారు. విజయ్ ఈ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, నిబంధనల ప్రకారం ఒకటే సీటు నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండటంతో.. ఒక స్థానాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి.. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగబోతున్నారు.
బల నిరూపణ అయితేనే..
ప్రస్తుతం విజయ్ పార్టీకి సొంతంగా 108 స్థానాల బలం ఉంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలను కలుపుకుని ఆ సంఖ్య 120కి చేరింది. అసెంబ్లీలో ఈ నెల 13న నిరూపణ జరిగే అవకాశం ఉంది. దీనిలో నెగ్గితేనే.. విజయ్కు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన సాగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

