కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) భార్య లతా రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెడుతారని తెలుస్తోంది. మక్కల్ మేడై (పీపుల్స్ స్టేజ్) పేరుతో సరికొత్త ఉద్యమం ప్రారంభించబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఇది సామాజిక సేవా సంస్థా? లేక రాజకీయ పార్టీకి పునాదా?’ అన్న ఆసక్తి నెలకొంది. సామాజిక సేవా సంస్థలు ప్రారంభించి.. వాటినే రాజకీయ పార్టీలుగా మార్చడం తమిళనాట కొత్త కాదు. ప్రస్తుత సీఎం విజయ్ కూడా ఇలాగే అభిమాన సంఘం ప్రారంభించి.. దాన్ని టీవీకే పార్టీకి అనుసంధానం చేశారు. ఫలితoగానే భారీ విజయం సాధించి.. తొలి ఎన్నికల్లోనే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. రజినీకాంత్ కూడా అదే ప్రణాళికలో ఉన్నారా.. అనే చర్చ నడుస్తోంది.

