కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు 35 నుంచి 40 డిగ్రీల వరకు ఎండలు దంచికొట్టాయి. అనంతరం మూడు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సంగారెడ్డి, పటాన్ చెరువు, ఆర్.సి.పురం,అమీన్ పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల కారణంగా పంట నష్టం జరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: కవిత పార్టీపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్
Follow Us On: WhatsApp

