కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రిభువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలో వీధి కుక్కలు ఓ బాలుడిపై చేయడంతో ఏకంగా ఆ బాలుడి కనుగుడ్డు ఊడిపడింది. గురువారం పట్టణంలోని తారకరామ్ నగర్ లో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాలుగేండ్ల చిన్నారి సందెల ప్రియాంష్ సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న సమయంలో బాలుడిపై ఓ వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడిలో బాబుకు తీవ్రగాయాలు కాగా కనుగుడ్డు బయటకొచ్చింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాబును భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.

