Mobile Popup Ad
Mobile Popup Ad

స్నేహితుల ముందు స్టంట్.. పాము కాటుతో యువకుడు మృతి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా చేసిన ప్రయత్నం ప్రాణాంతకంగా మారి ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌కు చెందిన మొహిద్దీన్ (30) తన స్నేహితులతో కలిసి మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు (Moinabad Farmhouse) వెళ్లాడు. అక్కడ సరదాగా స్నేహితులను భయపెట్టాలని భావించిన అతను, అక్కడ కనిపించిన కట్లపామును చేత్తో పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా ఆ పాము అతడిని కాటు (Snake Bite) వేసింది.

పాము కాటుతో మొహిద్దీన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరదాగా చేసిన చిన్న తప్పిదం ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>