epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారీగా పెరిగిన వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: వెండి ధరలు (Silver Price) అనూహ్యంగా పరుగులు తీస్తున్నాయి. ఒక్క రోజులోనే కిలో వెండి ధర (Silver Price) రూ.11 వేలకుపైగా పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.2,40,000గా ఉండగా, శనివారం అది రూ.2,51,000కు చేరుకుంది. ఇటీవల కాలంలో ఇంత భారీ పెరుగుదల నమోదవడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో వెండికి (Silver Price) డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణం అని తెలుస్తోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో వెండి వినియోగం భారీగా పెరుగుతోంది. గ్రీన్ ఎనర్జీపై ప్రపంచ దేశాలు ఎక్కువ దృష్టి పెట్టడంతో సోలార్ రంగంలో వెండి అవసరం మరింత పెరిగిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాలపై పెట్టుబడులు పెరగడం కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. బంగారంతో పాటు వెండిని కూడా భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో సరఫరాతో పోల్చితే డిమాండ్ ఎక్కువవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, రానున్న రోజుల్లో వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు ఈ స్థాయిలో కొనసాగుతాయా? లేక కొంత స్థిరపడతాయా? అన్నది అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని వారు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>