కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్పేట్ తహసీల్దార్ సుచరిత ఏసీబీకి (ACB) దొరికిపోయారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్గా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. బొంరాస్పేట్లో భారీగా ముడుపులు తీసుకుని భూములు కట్టబెట్టినట్లు ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఒక అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం కూడా ఇదే మొదటిసారి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

