కలం, వెబ్ డెస్క్ : సీనియర్ హీరో సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల (Shambala). ఈ మూవీ మొదటి పోస్టర్లు, టీజర్ తో మంచి అంచనాలు పెంచేసింది. యుగంధర్ ముని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా చేస్తోంది. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నాని ఈ శంబాల ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
మూవీ(Shambala) ట్రైలర్ వీడియోలో.. ‘పంచభూతాల్ని శాపిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే డైలాగ్తో ఆకట్టుకున్నారు. మూవీలో విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. శంబాల గ్రామంలో జరిగే సంఘటలన ఆధారంగా దీన్ని తీసినట్టు చూపించారు. ఆది చాలా రోజుల తర్వాత ఓ సీరియస్ పాత్రలో కనిపించాడు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Follow Us On: X(Twitter)


