Mobile Popup Ad
Mobile Popup Ad

షారుఖ్ ఖాన్ ఆటపై మురళీ కార్తీక్ అసంతృప్తి

కలం, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ ప్రదర్శనపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ (Murali Kartik) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు గెలిచినప్పటికీ, కీలక సమయంలో షారుఖ్ విఫలం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్, మరో 25 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఎనిమిది బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆయన, కేవలం 10.75 సగటుతో 43 పరుగులు మాత్రమే చేయగలిగారు.

దీనిపై మురళీ కార్తీక్ (Murali Kartik) స్పందిస్తూ.. షారుఖ్‌కు ఈ మ్యాచ్‌లో మంచి అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చినప్పటికీ దానిని ఉపయోగించుకోలేకపోయారని, ఇది అటు ఆటగాడికి, ఇటు జట్టు మేనేజ్‌మెంట్‌కు నిరాశ కలిగించే విషయమని పేర్కొన్నారు. చివరి నిమిషంలో వచ్చి తక్కువ బంతులు ఆడారనే సాకు కూడా ఇక్కడ పనికిరాదని ఆయన విమర్శించారు. మరోవైపు, రాహుల్ తెవాటియా ప్రదర్శనను కార్తీక్ ప్రశంసించారు. 17 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించడం తెవాటియాకు మంచి అనుభూతినిస్తుందని చెప్పారు. అయితే, అనవసర సమయంలో రివర్స్ స్వీప్ వంటి షాట్లు ఆడి వికెట్ రిస్క్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి జట్టు గెలవడంతో అంతా సవ్యంగానే ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also: షాకింగ్ .. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>