భారత స్టాక్ మార్కెట్ డమాల్.. భారీ నష్టాలు

కలం, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే BSE Sensex సుమారు 1,600 పాయింట్లు పడిపోగా, Nifty 50 450 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడైంది. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రభావంతోనే నష్టాలు వచ్చినట్టు సమాచారం. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునే సూచనలు ఇవ్వడం, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు పెరగడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ తలెత్తాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధరలు $100 పైకి ఎగసినట్టు సమాచారం. దీంతో ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుందన్న ఆందోళన పెట్టుబడిదారులను విక్రయాలవైపు మళ్లించింది. ఇక విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించడం కూడా మార్కెట్ పతనాన్ని వేగవంతం చేసింది. గ్లోబల్ మార్కెట్లలో “risk-off” ట్రెండ్ పెరగడంతో సురక్షిత పెట్టుబడుల వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, ట్రంప్ ట్వీట్‌లు, యుద్ధ భయాలు, పెరుగుతున్న క్రూడ్ ధరలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ అన్నీ కలిసి స్టాక్ మార్కెట్లపై భారీ ఒత్తిడిని సృష్టించాయి. పరిస్థితి స్థిరపడాలంటే జియోపాలిటికల్ ఉద్రిక్తతలు తగ్గడం కీలకమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>