కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు (V Hanumantha Rao) అస్వస్థతకు గురయ్యారు. మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు, సిబ్బంది ఖైరతాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. హనుమంతరావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రాజ్యసభ ఎంపీగా పనిచేసిన హనుమంతరావును ఇటీవలే ప్రభుత్వం బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించింది.

