నాడు ప్రియుడి కోసం కన్నవారినే చంపి.. నేడు బెయిల్ పై వచ్చి దారుణం!

కలం, మెదక్ బ్యూరో: తల్లిదండ్రులను మత్తు ఇంజెక్షన్‌తో దారుణంగా హత్య చేసిన కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన యువతి, తిరిగి అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి (Sangareddy ) పట్టణంలో వెలుగుచూసింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ అనే యువతి, తన లవర్‌తో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే కోపంతో ఈ ఏడాది జనవరి 25న వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దారుణంగా హత్య చేసింది.

తన తల్లిదండ్రుల హత్యల కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సురేఖ, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి సంగారెడ్డి శాంతినగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో నివాసముంటోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను చంపేందుకు ఉపయోగించిన రకం మత్తు ఇంజెక్షన్‌నే స్వయంగా తీసుకుని హాస్టల్ గదిలోనే సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>