epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్, పాక్​ యుద్ధం ఆపాడని అవార్డ్​ ఇచ్చారు!

కలం, వెబ్​డెస్క్​: భారత్​, పాక్​ యుద్ధంతోపాటు అనేక జగడాలు ఆపానని, నోబెల్​ శాంతి బహుమతికి తాను అర్హుడినని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)​ పదే పదే ఇంటా బయటా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్​, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ రికీ గిల్​ (Ricky Gill) అనే వ్యక్తిని ట్రంప్​ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. రంజిత్​ రికీ సింగ్​ గిల్​(37) భారతీయ మూలాలున్న వ్యక్తి. ప్రస్తుతం ట్రంప్​కు ప్రత్యేక సహాయకుడిగా, నేషనల్​ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్​ఎస్​సీ)లో సౌత్​ అండ్​ సెంట్రల్​ ఏసియా విభాగానికి సీనియర్​ డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ఆపారంటూ గిల్​కు ‘డిస్టింగ్విష్​డ్​ యాక్షన్​ అవార్డ్​’ను ఎన్​ఎస్​సీ​ ప్రకటించింది. ఈ అవార్డును గిల్​కు స్టేట్​ సెక్రటరీ మార్కో రూబియో అందజేశారు.

అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన భారతీయ సిక్కు కుటుంబంలో  గిల్ (Ricky Gill)​ జన్మించారు. తల్లిదండ్రులు జస్బీర్, పరమ్​ గిల్. యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియాలో గిల్​ న్యాయవిద్య చదివారు. అత్యంత ప్రతిభావంతుడైన గిల్​ పదిహేడేళ్లకే అమెరికా ప్రభుత్వంలో కొలువు సంపాదించారు. ప్రస్తుతం ఎన్​ఎస్​సీలో భారత్​, ఆఫ్గానిస్థాన్​, పాకిస్థాన్​ సహా దక్షిణ, మధ్య ఆసియాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం, ఆపరేషన్​ సింధూర్​ సమయంలో భారత్​, పాక్​ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల సైన్యం జరిపిన చర్చల్లో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని భారత్​ పదే పదే చెప్తోంది. యుద్ధం ఆగడంలో మరొకరి జోక్యం లేదంటోంది. అయినా ట్రంప్​ మాత్రం తన వల్లే భారత్​, పాక్​ యుద్ధం ఆగిందంటున్నారు. ఇప్పుడు తన వద్ద పనిచేసే వ్యక్తికి అవార్డు ఇచ్చి, తద్వారా తాను చెప్పేది నిజమని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: ఇజ్రాయెల్​ సంచలన నిర్ణయం.. ట్రంప్​ కు దేశ అత్యున్నత పురస్కారం!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>