epaper
Tuesday, November 18, 2025
epaper

మరోసారి ఢిల్లీకి రేవంత్.. ఈసారి ఎందుకంటే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. 54సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తాజాగా మరోసారి అంటే 55వ సారి ఢిల్లీ(Delhi)కి వెళ్లడానికి రేవంత్ రెడీ అయ్యారు. శనివారం ఉదయం ఢిల్లీలో తెలంగాణ నేతల సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి హాజరయ్యేందుకే రేవంత్ వెళ్తున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో డీసీసీ అధ్యక్షుల(DCC Presidents) నియామకంపై చర్చించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో డీసీసీ అధ్యక్షులను నిర్ణయించి.. వారి నియామకాలను అక్టోబర్ ఆఖరులోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొననున్నారు.

Read Also: అమెరికాలో భారతీయుడికి 15ఏళ్ల జైలు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>