ఐపీఎల్ చరిత్రలో మెగా డీల్.. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఆర్‌సీబీ!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఒప్పందంతో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) నుండి 100 శాతం వాటాను బిర్లా గ్రూప్ దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ భాగస్వాములుగా ఉన్నాయి. దీనికి ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా, సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఒక శక్తివంతమైన వేదికగా ఎదిగిందని కొనియాడారు. ఆర్సీబీ వంటి క్రేజ్ ఉన్న జట్టుకు సంరక్షకులుగా మారడం గర్వకారణమని, ఈ అద్భుతమైన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. సత్యన్ గజ్వానీ స్పందిస్తూ, బెంగళూరు అభిమానుల అండతో ఆర్సీబీని గ్లోబల్ స్పోర్టింగ్ సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శనివారం జరిగే మ్యాచ్‌లో టైటిల్ డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగుతున్న జట్టుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా రూ. 15,290 కోట్లకు అమ్ముడుపోగా, ఇప్పుడు ఆర్సీబీ అంతకంటే భారీ ధరకు అమ్ముడవడం విశేషం. ఈ మార్పు జట్టు భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>