epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ గవర్నర్​ భేటి

కలం, వెబ్ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్​బీఐ గవర్నర్​ (RBI Governor) సంజయ్​ మల్హోత్రా కలిశారు. బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గురువారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్​ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను రేవంత్​ రెడ్డి ఆర్బీఐ గవర్నర్​ కు వివరించారు. ప్రశంసించారు. విద్యుత్​ రంగం, రాష్ట్రంలో సోలార్ వినియోగం, ఆర్థిక విధానాలను ప్రశంసించిన ఆర్బీఐ గవర్నర్ (RBI Governor)​​. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అలాగే, తెలంగాణలో BUDS (Banning of Unregulated Deposit Schemes) యాక్ట్​ ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్​ సీఎం రేవంత్​ రెడ్డిని కోరారు. యూనిఫైడ్​ లెండింగ్​ ఇంటర్ ఫేస్​ (ULI) విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్​ తదితర అంశాలను సంజయ్​ మల్హోత్రా వివరించారు. ఈ సమావేశంలో సీఎస్​ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>