కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టి రెండు కిలో మీటర్ల మేర ఈడ్చుకెల్లింది. దీంతో బైకర్తో పాటు వెనుక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మైలార్దేవ్పల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కారు పల్లం చెరువు నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై కారు డ్రైవర్ను వెంబడించి చితకబాదారు. అతడిని పోలీసులకు అప్పగించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నారు.

