కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లా మంథనిలో (Manthani) దివంగత శ్రీపాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే (Ramagundam MLA) మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఎవడైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం‘ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయపరంగా విమర్శలు చేసే వారిని ఉద్దేశించి ఆయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

