అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం.. రామగుండం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లా మంథనిలో (Manthani) దివంగత శ్రీపాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే (Ramagundam MLA) మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఎవడైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం‘ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయపరంగా విమర్శలు చేసే వారిని ఉద్దేశించి ఆయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>