epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రూ.79వేల కోట్లతో రక్షణ కొనుగోళ్లు..

కలం, వెబ్​డెస్క్​: భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు సంబంధించి రూ.79కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు రక్షణ కొనుగోళ్ల మండలి(డిఫెన్స్​ అక్విజేషన్​ కౌన్సిల్​–డీఏసీ) అంగీకార పత్రం (యాక్సెప్టెన్స్​ ఆఫ్​ నెసెసిటీ–ఏవోఎన్​) మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ (Rajnath Singh) అధ్యక్షతన సమావేశమైన డీఏసీ ఆమోదించింది. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు అవసరమైన రాడార్లు, రేడియోలు, ఆటోమేటిక్​ టేకాఫ్​–ల్యాండింగ్ రికార్డింగ్​ సిస్టమ్స్​​, క్షిపణులు, సబ్​మెరైన్ల బెర్తింగ్​, అనువైన హార్బర్లు, అస్త్ర ఎంకే–2 మిస్సైల్స్​, దీర్ఘశ్రేణి గైడెడ్​ కిట్స్​, తదితర పరికరాలకు సంబంధించినవి ఈ రక్షణ కొనుగోళ్ళలో ఉన్నాయి. ప్రస్తుతం భూ, వాయు, సముద్ర మార్గాల్లో అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్నందున, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే దళాల ఆధునికీకరణ, ఆపరేషన్​కు సంసిద్ధత వంటివి మరింత మెరుగుపర్చాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం రూ.79 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులకు ఈ ఏవోఎన్​కు ఆమోదం తెలిపినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>