epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాలుష్యం పనిపట్టేలా రంగంలోకి ‘సముద్ర ప్రతాప్’​

కలం, వెబ్​డెస్క్: సముద్రంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు భారత్​ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్​ కోస్ట్​ గార్డ్​(ఐసీజీ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్​’ (Samudra Pratap) ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. సోమవారం గోవాలోని పనాజీ పోర్ట్​లో ఈ నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. 114.5 మీటర్ల పొడవున్న ఈ నౌకను గోవా షిప్​యార్డ్​ లిమిటెడ్​ (జీఎస్​ఎల్​) తయారుచేసింది. దీని నిర్మాణంలో 60శాతం స్వదేశీ పరికరాలు వాడారు. 4,200 టన్నుల బరువున్న ఈ నౌక గరిష్ఠంగా 22 నాట్​ల స్పీడ్​తో ప్రయాణించగలదు. 6వేల నాటికల్​ మైళ్ల వరకు సంచరించగలదు. అంతర్జాతీయ సముద్ర చట్టాల పరిరక్షణ, సముద్ర కాలుష్య నియంత్రణ నిబంధనల అమలు, శోధన–రక్షణ చర్యలతో పాటు భారత ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్​) రక్షణ బాధ్యతల్లో భాగమవుతుంది.

Samudra Pratap
Samudra Pratap

Read Also: సీనియర్ సిటిజెన్స్‌కు బెస్ట్ ఎఫ్‌డీలు ఇవే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>