కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానం (Ram Lela Ground) లో జరుగుతున్న ‘ఓట్ చోర్ – గద్దీ చోడ్’ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన దర్నాలో ఆయన మాట్లాడారు. సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ (SIR) కు వ్యతిరేకంగా సంతకాలు సేకరించామని తెలిపారు. మన దేశం నుంచి మోడీ (Modi), అమిత్ షా , ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని తొలగిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో కలిసి ఎన్నికల సంఘం పని చేస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. హరియాణ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు.
Read Also: భారత విదేశాంగ విధానం విఫలం : ప్రియాంక గాంధీ
Follow Us On: Sharechat


