epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత విదేశాంగ విధానం విఫలం : ప్రియాంక గాంధీ

కలం, వెబ్ డెస్క్​ : భారత్ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమయిందని వయనాడ్​ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. రామ్​ లీలా మైదానంలో కాంగ్రెస్​ నిర్వహించిన ‘ఓట్​ చోర్ – గద్దీ చోడ్​’ (Vote Chore – Gaddi Chode) దర్నా కార్యక్రమానికి కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) దర్నాలో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, దానికి కారణం బీజేపీయేనని ఆరోపించారు. డాలర్​ విలువ 90 రూపాయలకు చేరుకుందని.. నిరుద్యోగం, ద్రవ్యోల్భణంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేపర్​ లీకుల కారణంగా యువత ఉద్యోగాల్లో నష్టపోతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు.

 Read Also: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>