కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని పోతంగల్ మండల పరిధి కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ప్రారంభించారు.
ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం నిజామాబాద్ జిల్లాలోనే కల్లూరు గ్రామంలో మొట్టమొదటి మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బోధన్ ఆర్డీవో విజయకుమారి, డీఆర్డీఏ పీడీ సాయన్న, పంచాయితీ రాజ్ ఈఈ వీరానంద్, పోతంగల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

