కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అలాగే, ప్రపంచ దేశాల్లోని భారతీయులపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఐదు దేశాల పర్యటనకు సిద్ధం అయ్యారు. ఆరురోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా తొలుత నేడు (శుక్రవారం) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనకు మోదీ బయలు దేరారు. అక్కడ ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు ముఖ్యంగా ఇంధన సహకారంపై ఇరుదేశాల అధినేతలు చర్చించనున్నారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

