కలం, వెబ్ డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలను కోరారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పించాలని ఆయన సూచించారు.
ఈ ఆగస్టు 15న ప్రతీ ఇంట్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతీ ఇల్లు, ప్రతీ మనస్సు భారత పతాకంతో నిండిపోవాలని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆకాంక్షించారు. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోదీ దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ఈ పిలుపుతో దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ఉత్సాహం మళ్లీ మొదలైంది.

