కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సిట్ బృందంలోని కొంతమంది అధికారులు గురువారం సీపీ సజ్జనార్ (CP Sajjanar) తో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఇంటలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. కేసు ప్రగతిపై, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలపై సమీక్ష జరిపి, తదుపరి కార్యాచరణపై భేటీలో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ డీజీపీని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: ఢిల్లీ గ్యాస్ ఛాంబర్.. దేశ రాజధానిగా బెంగుళూరు బెస్ట్: వీడియో వైరల్
Follow Us On: X(Twitter


