Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ టికెట్​ ధర పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్ట్​లో పిటిషన్​!

క‌లం, వెబ్ డెస్క్: మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​ (Ram Charan) హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది (Peddi) టికెట్​ ధరల పెంపు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తెలంగాణలో టికెట్​ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి హైకోర్ట్​లో పిటిషన్​ దాఖలు చేశారు. ధరల పెంపులో జీవో 151 నిబంధనలు పాటించలేదని సదరు వ్యక్తి పిటిషన్​లో పేర్కొన్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ జూన్​ 2న టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేశారని పిటిషనర్ ఆరోపించారు. దీంతో నేడు హైకోర్ట్​ టికెట్ ధరల పెంపు జీవో చట్టబద్ధతపై విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>