కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీల సమావేశానికి (DCC Meeting) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పీసీసీ(PCC), డీసీసీ అధ్యక్షులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు సైతం హైదరాబాద్ నుంచి తరలివెళ్లారు. అయితే ఈ సమావేశానికి మంత్రులు (Ministers) ఎవరూ రావొద్దని పీసీసీ తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో వికారాబాద్ వరకు వెళ్లిన మంత్రులు తమ కార్లలో తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. పీసీసీ తీరుపై పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

