epaper
Monday, March 2, 2026
epaper

డీసీసీ మీటింగ్‌లో మంత్రులకు అవమానం..!

క‌లం, వెబ్ డెస్క్‌: వికారాబాద్ జిల్లాలోని అనంత‌గిరి హిల్స్‌లో జ‌రుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ క‌మిటీల స‌మావేశానికి (DCC Meeting) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పీసీసీ(PCC), డీసీసీ అధ్య‌క్షులు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మంత్రులు సైతం హైద‌రాబాద్ నుంచి త‌ర‌లివెళ్లారు. అయితే ఈ సమావేశానికి మంత్రులు (Ministers) ఎవ‌రూ రావొద్ద‌ని పీసీసీ తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో వికారాబాద్ వ‌ర‌కు వెళ్లిన మంత్రులు త‌మ కార్ల‌లో తిరిగి హైదరాబాద్‌కు ప‌య‌న‌మ‌య్యారు. పీసీసీ తీరుపై ప‌లువురు మంత్రులు అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!