Mobile Popup Ad
Mobile Popup Ad

రైతులను బలి తీసుకుంటున్న వరి కొయ్యలు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో వరి కొయ్యలు ఇద్దరు రైతులను బలి తీసుకున్నాయి. మిరుదొడ్డి మండలంలో మద్దెల మల్లయ్య అనే వ్యక్తి గురువారం నాఆడు వరి కొయ్యలు తగలబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మృతి చెందాడు . ఊపిరాడకపోవడంతో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే జిల్లాలో అయిదు రోజుల కిందట అక్బర్ పేట భూంపల్లి మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలకు మంటలు పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి, ఎల్లయ్య(60) అనే రైతు అస్వస్థతతో చనిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో, వ్యవసాయాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరి కొయ్యలను తగలబెట్టొద్దని.. వాటి వలన భూసారం తగ్గిపోవడంతో పాటు ప్రాణాలకు ప్రమాదం అని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>