Mobile Popup Ad
Mobile Popup Ad

నిజామాబాద్‌లో దారుణం.. పసికందును చంపిన తండ్రి

కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్‌ (Nizamabad)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పసికందు పాలిట కన్నతండ్రే కాలయముడిగా మారాడు. రెండున్నర నెలల తన కొడుకుని నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలో దారుణంగా నరికి చంపడం తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నయాగావ్‌కు చెందిన యువరాజ్‌, నిజామాబాద్‌లోని (Nizamabad) అశోక్‌నగర్ కాలనీకి చెందిన ప్రియాంక ఏడాది కిందట పెళ్లి అయింది. మిర్చి కాంపౌండ్ ప్రాంతంలో ఉంటున్న వీరికి ఇటీవల మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ చిన్నారి తనకు పుట్టలేదని అనుమానంతో కొంతకాలంగా యువరాజ్ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం చిన్నారిని ఇంటి నుంచి నగరంలోని రైల్వే ట్రాక్ పక్కకు బాబును తీసుకొచ్చిన యువరాజ్.. పసికందును కత్తితో నరికి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే పట్టాల పక్కన పడేసి పరారయ్యాడు.

అయితే భర్త, కుమారుడు ఇంటికి రాకపోవడంతో ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి తల్లి ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం స్థానికుల చేత కంటతడి పెట్టించింది.

Read Also: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>