కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన విద్యార్థులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అభినందించారు. వనపర్తి స్కాలర్స్ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న చావ భవ్య శ్రీకి 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్, డి.పల్లవి 437 మార్కులతో నాలుగో ర్యాంక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్నాథ్ రెడ్డి, నరసింహ, చిట్యాల రాము, అలీమ్, ఆర్.చంద్రశేఖర్, సేనాపతి, నిరంజన్, వంశీ పాల్గొన్నారు.
Read Also: విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు
Follow Us On: Instagram

