కలం, వెబ్డెస్క్: ఫాస్టాగ్ (FASTag) యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్ న్యూస్ చెప్పింది. కార్లు, జీప్లు, వ్యాన్లకు కొత్తగా ఇచ్చే ఫాస్టాగ్లకు నో యువర్ వెహికల్ (KYV)ను నిలిపేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. వెహికల్కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ వల్ల ఫాస్టాగ్ యాక్టివేషన్ ఆలస్యం అవుతున్నట్లు తెలియడంతో ఈ నిబంధనను ఎన్హెచ్ఏఐ తొలగించింది. కాగా, ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్లకు కూడా కేవైవీ అవసరం లేదని చెప్పింది. నిజానికి ఫాస్టాగ్ను వాహనంపై సరిగా అతికించపోవడం, దుర్వినియోగం చేయడం వంటి సందర్భాల్లో మాత్రమే కేవైవీ అవసరం.
వెహికల్ డేటాబేస్లో వివరాలు సరిచూసుకున్నాకే బ్యాంకులు ఫాస్టాగ్ ఇస్తాయి. ఆ తర్వాత ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుంది. అయితే, ఫాస్టాగ్ (FASTag) సరైన వాహనానికే లింక్ చేశారా? ముందు భాగంలో విండ్ షీల్డ్పై సరిగా అతికించారా? అనేది తెలుసుకోవడం కేవైవీ నిబంధన ముఖ్య ఉద్ధేశ్యం. అందువల్ల వెహికల్ ఫ్రంట్, సైడ్ ఫొటోలు తీసి, ఫాస్టాగ్ అతికించిన చోటు ఫొటోలు తీసి వాహనదారులు అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం కేవైవీ రద్దుతో ఈ ఇబ్బంది ఇకపై ఉండదు.
Read Also: బిగ్ బ్రేకింగ్: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత
Follow Us On: Youtube


